• 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు.
• పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.
• బందోబస్తుకు విచ్చేసిన పోలీసులకు దిశా నిర్దేశం చేసిన ... జిల్లా ఎస్పీ.
పింఛన్ల పంపిణీ కార్యక్రమం సంధర్బంగా కర్నూలు జిల్లా , పత్తికొండ మండలం, పుచ్చకాయలమడ గ్రామం కు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగష్టు 31 వ తేదీన( శనివారం) రానున్న నేపథ్యంలో పత్తికొండ పట్టణంలోని గోపాల్ ప్లాజా ఫంక్షన్ హాల్ లో బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసులకు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ పలు సూచనలు, సలహాలు చేసి దిశా నిర్దేశం చేశారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...
పత్తికొండ మండలం, పుచ్చకాయలమడ గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటించే రూట్ & రూఫ్ - టాప్ ప్రాంతాలలో, సిఎం కాన్వాయ్, హెలిపాడ్, సభ సమావేశ ప్రాంగణం , తదితర ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వహించే మఫ్టీ పోలీసులు , స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు , పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసు అధికారులు , పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఏలాంటి సంఘటనలు జరగకుండా భద్రత పరంగా పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు.
వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు.
చేయకూడనవి, చేయవలసిన వాటికి గురించి తెలిపారు.
అనంతరం సి ఎం కాన్వాయ్ రిహార్సల్స్ ను , హెలిప్యాడ్, ముఖ్యమంత్రి సభ ప్రాంగణం వద్ద జిల్లా ఎస్పీ భద్రత ఏర్పాట్ల ను పరిశీలించారు.
అడిషనల్ ఎస్పీ ఒకరు , 6 మంది డిఎస్పీలు, 30 మంది సిఐలు, 43 మంది ఎస్సైలు , 154 మంది ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుళ్ళు , 247 మంది కానిస్టేబుళ్ళు , 28 మంది మహిళా పోలీసులు, 150 మంది హోంగార్డులు, 3 సెక్షన్ల ఏ ఆర్ సిబ్బంది, 5 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు.
జిల్లా ఎస్పీ తో పాటు కడప జిల్లా ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణరావు, డిఎస్పీలు వెంకట్రామయ్య, శ్రీనివాసాచారి, కృష్ణమోహన్, సోమన్న, శ్రీనివాసులు, శ్రీనివాసరావు, సిఐలు, ఎస్సైలు , పోలీసు సిబ్బంది ఉన్నారు.