నూతన చైర్మన్ గా యం.ఈరమ్మ.
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- గత సంవత్సరం వైసీపీ ప్రభుత్వంలో వాటర్ షెడ్ కమిటీ ఏర్పాటు చేయడం ఆ ప్రభుత్వంలో పనులు సరిగా చేయకపోవడంతో టిడిపి ప్రభుత్వం పై ఆదేశాల మేరకు హాలహర్వి మండల కేంద్రంలో ఆర్ బి కే కార్యాలయంలో వాటర్ షెడ్ నూతన కమిటీ నిర్వహించారు, నూతన కమిటీ పిఓ వలిసాబ్ ఆధ్వర్యంలో నూతన వాటర్ షెడ్ కమిటీ చైర్మన్ గా యం.ఈరమ్మ. వైస్ చైర్మన్ కే. మల్లికార్జున, సెక్రెటరీగా పంపపతి, కమిటీ సభ్యులు, అమృత, సుజాతమ్మ, ఉల్లిగమ్మ వీరభద్ర, అద్దేప్ప, గా ఎన్నుకోవడం జరిగింది ,అనంతరం వారికి పూలమాలవేసి సత్కరించారు, జరిగింది అనంతరం పిఓ వలి సాబ్ మాట్లాడుతూ నేటి నుండి ఈ వాటర్ సెడ్ పనులు, వేగవంతంగా చేయాలని,ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యాయని, వెంటనే రైతుల దగ్గర నుండి దరఖాస్తులు సేకరించి వాటర్ షెడ్ పనులు మొదలు పెట్టాలని వారన్నారు. ఈ కార్యక్రమానికి హాలహర్వి సర్పంచ్ తండ్రి నరసప్ప, సర్పంచ్ మల్లికార్జున, బాబు, పంచాయతీ సెక్రెటరీ ఈరన్న, వాటర్ షెడ్ అధికారులు,జేఈ పురుషోత్తం రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గోవిందప్ప, టిడిపి నాయకులు కార్యకర్తలు శ్రీధర్, మారుతి, చిత్రగుడి, నాగరాజ్,రంగముని, కురువప్ప లోకేష్, గోపాల్, పరశురాం రైతులు, తదితరులు పాల్గొన్నారు.