దేవరగట్టు బన్ని ఉత్సవం భద్రత ను పర్యవేక్షించిన...

దేవరగట్టు బన్ని ఉత్సవం భద్రత ను పర్యవేక్షించిన...

కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ , ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్  

ప్రశాంతంగా ముగిసిన బన్ని ఉత్సవం... బన్ని ఉత్సవం ఇది ఒక సంబరం..

బన్ని ఉత్సవం లో పోలీసులకు సహాకరించిన ఇతర శాఖలకు, మీడియా వారికి ప్రత్యేక అభినందనలు తెల్పిన ... జిల్లా ఎస్పీ. 

V 3 టీవీ తెలుగు న్యూస్: 


కర్నూలు జిల్లా, హోళగుంద మండలం , దేవరగట్టులో ఆదివారం దసరా పండుగ సంధర్బంగా బన్ని ఉత్సవాన్ని సంప్రదాయంగా కొనసాగించారు.
కట్టుదిట్టమైన భద్రత మధ్య బన్ని ఉత్సవం ముగిసింది.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ మీడియాతో మాట్లాడారు. 
అక్టోబర్ 12 న దసర పండుగ సంధర్బంగా దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవం ప్రశాంతంగా ముగిసిందన్నారు.
కళ్యాణం, భవిష్యవాణి, బన్ని ఉత్సవం ప్రశాంతంగా జరిగాయన్నారు. 
ప్రతి ఏటా కన్న ఈ ఏటా వర్షాలు బాగా పడడం వలన పంటలు బాగా పండి ప్రజలు 2 లక్షల కు పైగా బన్ని ఉత్సవం కు వచ్చారన్నారు. 
ఎక్కడా కూడా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదన్నారు. 
చిన్న చిన్న చెదురు , ముదురు ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు.  
చిన్న చిన్న గాయాలైనా వారికి ఆదోని సబ్ కలెక్టర్ సహాకారంతో మెరుగైన వైద్యం అందించామన్నారు. 
2 లక్షల మంది పై గా పాల్గొన్న ఈ బన్ని ఉత్సవంలో మొత్తం 60 మంది దాకా గాయాలు కావడం జరిగిందన్నారు. ( మొత్తం 60 మందిలో ... బన్ని ఉత్సవం సంధర్బంగా 30 మందికి , గుడి దగ్గర కొండ పైకి మెట్లు ఎక్కడం, దిగడం తోపులాట లో మరియు దూర ప్రయాణంలో చిన్న చిన్న ప్రమాదాలు ఇంకొ 30 మందికి గాయాలు కావడం జరిగిందన్నారు) . ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ పాయం లేదన్నారు. 
ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించడంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయన్నారు. 
బందోబస్తు విధులలో కర్నూలు జిల్లా పోలీసులతో పాటు , ఇతర జిల్లాల నుండి వచ్చిన పోలీసు సిబ్బంది అందరూ కూడా బాగా విధులు నిర్వర్తించినందుకు అభినందిస్తున్నామన్నారు. 
ఈ బన్ని ఉత్సవం విజయవంతం కావడానికి మీడియా వారి సహాకారం కూడా ఉందన్నారు. 
 5 డ్రోన్ల తో నిఘా ఉంచామన్నారు. ఎక్కడ కూడా హింసాత్మక ఘటనలు జరగలేదన్నారు. ఒక సంబరం లాగా జరిగిందన్నారు.
జిల్లా ఎస్పీ గారితో పాటు జిల్లా టిడిపి పార్టీ ఇంచార్జ్ తిక్కారెడ్డి, ఆలూరు నియోజక వర్గ ఇంచార్జ్ వీరభద్రగౌడ్, పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్ , డిస్పీలు వెంకట్రామయ్య, శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు , డివిజనల్ పంచాయితి అధికారి నూర్జహాన్, ట్రైనీ డిఎస్పీ ఉష శ్రీ, సిఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.