పెనుకొండ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అత్యాచారాలను అరికట్టాలి మహిళా రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హర్ష కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకీ మహిళలపై విద్యార్థినిలపై దాడులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్తుంది ఆచరణలో ఏమాత్రం లేదు. మహిళలపై విద్యార్థులపై అత్యాచారాలు దాడులు జరగడానికి ముఖ్య కారణం మత్తు పదార్థాలు, మద్యం. రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులను ఎక్కడికక్కడ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం ద్వారా తాగేవారికి హద్దు లేకుండాతాగిన మైకంలో అత్యాచారాలు దాడులు చేస్తున్నారు.ఎక్కడా లేనంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ చాలా ఎక్కువగా ఎగుమతి అవడం జరుగుతుంది.మహిళలను దేవతల్లాగా పూజించే మనదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళ రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా హోం మంత్రి ఒక మహిళ కానీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. అదేవిధంగా విశాఖ లా విద్యార్థినిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. ప్రేమే ప్రధాన కారణంగా హత్యాచారం జరిగింది. ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేసి లైంగికంగా వేధించి చిత్రహింసలు పెట్టాడు. అతను లైంగికంగా వేధించడమే కాకుండాతన మిత్రులతో కూడా అమ్మాయిని లైంగికంగా వేధించడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మహిళలకు, విద్యార్థినీలకు రక్షణ కల్పించాలని కోరారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా మహిళలను కలుపుకొని మీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హర్ష కుమార్ పాల్గొన్నారు.