దేశంలో అత్యధిక మంది షుగర్ పేషెంట్లు తమిళనాడులో ఉన్నారని కేంద్రంతెలిపింది. అక్కడ 80.90లక్షల మంది వ్యాధిబారిన పడినట్లు పేర్కొంది. ఈ జాబితాలో రెండో స్థానంలో మహారాష్ట్ర(39.81 లక్షలు), మూడో ప్లేస్లో కేరళ (28.74 లక్షలు), 4వ స్థానంలో తెలంగాణ(24.52 లక్షలు) నిలిచాయి. ఇక ఏపీలో 20.92 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. అత్యల్పంగా ఢిల్లీలో 1,108 మంది బాధితులే ఉండటం గమనార్హం.