బీ-అలెర్ట్ రైతన్న....*ఈ తూకం యంత్రం.. వారు చెప్పినట్లు వింటుంది..!!!

*బీ-అలెర్ట్ రైతన్న....*

ఈ తూకం యంత్రం.. వారు చెప్పినట్లు వింటుంది..!!!

రిమోట్ తో బరువును తగ్గిస్తున్న దళారులు..

 పత్తి కొనుగోళ్లలో రైతులకు టోకరా

పత్తి కొనుగోళ్లలో దళారులు చేస్తున్న మాయ ఇది. ఇటీవల కొందరు రైతులు ఈ మోసాన్ని గుర్తించారు. చిన్న రైతులు రవాణా వ్యయప్రయాసలు భరిం చలేక పత్తిని గ్రామాల్లోనే దళారులకు విక్రయిస్తున్నారు.

మార్కెట్ కంటే క్వింటాపై రూ.100- 200 ఎక్కువ చెల్లిస్తామంటూ దళారులు చెబుతుండడం మరో కారణం.

రైతుల ఇళ్లు, పొలాల వద్దకే దళారులు వాహనంలో యంత్రాలను తీసుకెళ్లి పంటను తూకం వేస్తారు. ఆ యంత్రంలో ఒక చిప్ను అమరుస్తున్నారు.

50-100 మీటర్ల దూరం నుంచి రిమోట్ తో ఈ చిప్ను నియంత్రించవచ్చు.

రిమోట్ లోని బటన్ ను ఒకసారి నొక్కితే.. 5 కిలోలు, రెండుసార్లు నొక్కితే 10 కిలోలు తగ్గేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మరికొందరు యంత్రాల్లో ముందుగానే 5 నుంచి 10 కిలోలు తగ్గేలా సర్దుబాటు చేసుకొని మోసగిస్తున్నారు.

నాకు తెలిసిన ఓ పత్తి రైతుకు పాపం ఇలాంటి అనుభవమే ఎదురైంది . '40-45 కిలోలు తూగాల్సిన పత్తి బస్తాను కాంటా పై పెడితే, 35 కిలోలే చూపించడంతో అను మానం వచ్చింది.

అదే యంత్రంపై 90 కిలోల బరువున్న వ్యక్తిని నిలబెట్టగా.. 68 కిలోలే చూపింది. ఓ వ్యక్తి దూరంగా నిలబడి, జేబులో ఉన్న రిమోట్తో బరువును నియంత్రిస్తున్నట్లు గమనించి.. ఆ వ్యాపారిని నిలదీసి అడిగినట్లు అ తెలిపారు తప్పు జరిగిపోయింది క్షమించు అని ఆ వ్యాపారి రైతు కాళ్ళ ఏళ్ల పడ్డాడట ఎవరికీ చెప్పకండి అని రైతు దగ్గర మాట కూడా తీసుకున్నాడట ' అని తెలిసింది.