రెండవ రోజు కొనసాగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు .
పోలీసు నియామక పక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా కు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు కర్నూలు APSP 2 వ బెటాలియన్ లో రెండవ రోజు దేహదారుడ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.
మంగళవారం 600 మంది అభ్యర్దులను పిలిచారు.
ఇందులో 266 మంది అభ్యర్దులు బయోమెట్రిక్ కు హజరయ్యారు.
వీరికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు, చాతి వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు.
అనంతరం వీరందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు.