స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న పోరాట స్ఫూర్తి మరువలేనిది. అడిషనల్ ఎస్పీ జి. హుస్సేన్ పీరా



స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న పోరాట స్ఫూర్తి మరువలేనిది.

స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న పోరాట స్ఫూర్తి మరువలేనిదని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి .హుస్సేన్ పీరా పేర్కొన్నారు.
శనివారం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అడిషనల్ ఎస్పీ  నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ  మాట్లాడుతూ ...

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను జనవరి 11వ తేదీన  అన్ని విభాగాలలో, జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు..
వడ్డే ఓబన్న నంద్యాల జిల్లాలోని సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వడ్డే సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు 1807 జనవరి 11న జన్మించారన్నారు.
ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా   ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తో కలిసి వడ్డే ఓబన్న వీరోచితంగా పోరాడారన్నారు.
సమాజ హితం కోసం వడ్డే ఓబన్న చేసిన  సేవలు మరువలేనివని, వారి పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఉందని అడిషనల్ ఎస్పీ  పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు సోమశేఖర్ నాయక్ , నారాయణ, ఆర్ ఎస్సైలు పాల్గొన్నారు.