రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సహకారంతో చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమంను సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్ H O D లా అధ్యక్షతన జరిగినది
March 15, 2025
రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సహకారంతో చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమంను సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్ దగ్గర H.O.D లా అధ్యక్షతన జరపడం జరిగినది
. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు రాయలసీమ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రారంభించారు. పరీక్షలు రాసి వచ్చిన ఇంటర్ విద్యార్థులు మరియు ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. రిజిస్టర్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థులకు సేవాభావాలు వస్తాయి అని విద్యార్థులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధ్యాపకులు నాగచంద్రుడు, శివ మరియు కే చిన్నయ్య మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు